
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును దర్యాప్తు చేస్తున్న జ్యుడీషియల్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను దర్యాప్తు చేస్తున్న కమిషన్కు జస్టిస్ పి.సి. ఘోష్ చైర్మన్గా పనిచేస్తున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు అధికారులు మరియు నిపుణులను ప్రశ్నించినట్లు తెలిసింది.