హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది.
అక్టోబర్ 3 నుంచి పది రోజుల పాటు దసరా సెలవులు ప్రారంభం కానుండగా.. గురువారం (అక్టోబర్ 3) నుంచి అక్టోబర్ 13 (ఆదివారం) వరకు దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 14న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
ఈ మేరకు సంబంధిత అధికారులకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ నిర్ణయం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తుంది.