
అనంతపురం: నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలులో తెల్లవారుజామున 1:30 గంటలకు గుత్తి సమీపంలో దొంగతనం జరిగినట్లు సమాచారం. అమరావతి ఎక్స్ప్రెస్ వెళ్లేందుకు రైలును నిలిపివేసారు. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు 10 కంపార్ట్మెంట్లలోకి ప్రవేశించి నగదు, బంగారు ఆభరణాలతో పారిపోయారని ఒక వార్తా నివేదిక తెలిపింది. సుమారు 20 మంది బాధితులు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.