
అమరావతి: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై యాసిడ్ దాడి జరిగింది.
మదనపల్లెలోని అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ అనే దుండగుడు మొదట ఆమెపై కత్తితో దాడి చేసి, తర్వాత ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు.
బాధితురాలి వివాహం ఏప్రిల్ 29న జరగాల్సి ఉంది, ఆమెను చికిత్స కోసం మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.