
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్: తమ ముఖ్యనేతలపై బుల్డోజర్లు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ బిఆర్ఎస్ మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలోని పార్టీ నేతల బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు, సీనియర్ నేత టి.హరీష్రావులపై బుల్డోజర్ ప్రయోగిస్తామని ముఖ్యమంత్రి బెదిరించారని శ్రీనివాస్ అన్నారు.