కుమురం భీమ్ జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థిని సాయిశ్రధకు ఎంబీబీఎస్ ఫీజు చెల్లించేందుకు ఆర్థిక సాయం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కుమురం భీమ్ జిల్లా జైనూర్ మండలం జెండాగూడ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన విద్యార్థిని సాయిశ్రధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఆర్థిక సహాయం అందించారు.
సాయిశ్రద్దకు ఎంబీబీఎస్ సీటు రావడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కాలేజీ ఫీజు చెల్లించలేదు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి డాక్టర్ కావాలనే ఆ బాలిక కలను నెరవేర్చే బాధ్యతను ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయం అందించారు.