హైదరాబాద్: నగరంలో నాలుగో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భాగంగా సినీ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును అధికారులు తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్విసి)కి తీసుకెళ్లారు. దిల్ రాజు ఇంట్లో అధికారులు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా ఆదాయానికి, నిర్మాణ సంస్థలు చెల్లించిన పన్నుకు తేడాలున్నాయని గుర్తించిన అధికారులు ఆయా సంస్థల కార్యాలయాలపై దాడులు ప్రారంభించారు.
ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.