ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బల్ల సముద్రం సమీపంలో శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
క్షతగాత్రులను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో మినీ వ్యాన్లో 14 మంది ఉన్నారు.
మృతులు గుడిబండ, అమరాపురం మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. తిరుమల నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.